నా మనసు క్షోభిస్తోంది

Update: 2018-11-01 06:21 GMT

గుజరాత్ లోని స్టాట్యూ ఆఫ్ యూనిటీ వద్ద తెలుగు భాషకు గుర్తింపు లభించకపోవడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీవ్రంగా మండిపడ్డారు. దేశంలో ఎక్కువమంది మాట్లాడే మూడో అతిపెద్ద భాషకు గుర్తింపు ఇవ్వకపోవడం పట్ల తెలుగు మాట్లాడే వ్యక్తిగా తన మనస్సు క్షోభిస్తోందని, పైసా ఖర్చు లేని కార్యక్రమంలో కూడా తెలుగువారి పై ఇంతటి వివక్షా చూపిస్తారా అని ప్రశ్నించారు. ప్రతి తెలుగువారు ఆలోచించి ఆవేదనను వ్యక్తం చేయాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పేర్కొన్నారు.

Similar News