మోదీ కీలక భేటీ.. విస్తరణ రేపు ఉదయమే?

ప్రధాని నరేంద్ర మోదీ నేడు మంత్రులు, సీనియర్ నేతలతో భేటీ కానున్నారు. రేపు మంత్రివర్గ విస్తరణ జరిపే అవకాశముంది. రేపు ఉదయం 11 గంటలకు మంత్రి వర్గ [more]

Update: 2021-07-06 03:38 GMT

ప్రధాని నరేంద్ర మోదీ నేడు మంత్రులు, సీనియర్ నేతలతో భేటీ కానున్నారు. రేపు మంత్రివర్గ విస్తరణ జరిపే అవకాశముంది. రేపు ఉదయం 11 గంటలకు మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని తెలుస్తోంది. దాదాపు ఇరవై మంది కొత్తవారికి అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రధానంగా త్వరలో జరిగే ఐదు రాష్ట్రాలకు చెందిన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఉత్తర్ ప్రదేశ్ నుంచి ఎక్కువ మందికి అవకాశం దక్కనుంది. అలాగే జ్యోతిరాదిత్య సింధియా, వరుణ్ గాంధీలకు చోటుదక్కనుందని తెలుస్తోంది. అందుకే ఈరోజు నరేంద్ర మోదీ కీలక సమావేశం జరుపుతున్నారు.

Tags:    

Similar News