మోదీ పర్యటనకు కేసీఆర్ కు నో

ప్రధాని నరేంద్ర మోదీ నేడు హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు అనుమతి లభించలేదు. కేవలం ఐదుగురు అధికారులకు మాత్రమే [more]

Update: 2020-11-28 02:42 GMT

ప్రధాని నరేంద్ర మోదీ నేడు హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు అనుమతి లభించలేదు. కేవలం ఐదుగురు అధికారులకు మాత్రమే అనుమతిని ప్రధానమంత్రి కార్యాలయం ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ నేడు భారత్ బయోటెక్ సంస్థను సందర్శించనున్నారు. కరోనా వ్యాక్సిన్ తయారీ పురోగతిని మోదీ సమీక్షించనున్నారు. అయితే విమానాశ్రయం వద్ద మోదీకి స్వాగతం పలికేందుకు కేవలం అధికారులకు మాత్రమే అనుమతి ఇచ్చారు. చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, మేడ్చల్ కలెక్టర్ శ్వేతా మొహంతి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ లకు మాత్రమే ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు అనుమతి లభించింది. గతంలో ఎన్నడూ ప్రధాని పర్యటనలో ముఖ్యమంత్రి, గవర్నర్ లకు అవాకాశం ఇవ్వకుండా లేరన్న కామెంట్స్ వినపడుతున్నాయి.

Tags:    

Similar News