నేడు మోదీ జాతినుద్దేశించి ప్రసంగం.. దేనిపైన అంటే?

ప్రధాని నరేంద్ర మోదీ నేడు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. లాక్ డౌన్ ఐదో విడత ముగియడంతో మోదీ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సాయంత్రం నాలుగు గంటలకు మోదీ [more]

Update: 2020-06-30 02:58 GMT

ప్రధాని నరేంద్ర మోదీ నేడు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. లాక్ డౌన్ ఐదో విడత ముగియడంతో మోదీ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సాయంత్రం నాలుగు గంటలకు మోదీ ప్రసంగించనున్నారు. దేశ వ్యాప్తంగా కంటెయిన్ మెంట్ జోన్లలోనే జులై 31వ తేదీ వరకూ లాక్ డౌన్ కొనసాగుతుందని చెప్పారు. తాజాగా లాక్ డౌన్ పై మరిన్ని సడలింపులు ఇచ్చారు. రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలకు అభ్యంతరం చెప్పవద్దని రాష్ట్రాలను కోరారు. జులై 31వ తేదీ వరకూ విద్యాసంస్థలు, మెట్రో రైళ్లు, సినిమా హాళ్లను మాత్రం మూసివేయాలని ఆదేశించారు. మిగిలిన వన్నీ యధాతధంగా ఉంటాయి. మోదీ తన ప్రసంగంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటంపైన మాత్రమే కాకుండా చైనా, భారత్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల విషయం కూడా పేర్కొంటారని తెలుస్తోంది.

Tags:    

Similar News