గవర్నర్ ను మార్చేస్తున్నారా?

తెలంగాణ గవర్నర్ నరసింహన్ ను మార్చే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. ఆయన స్థానంలో కేరళ గవర్నర్ సదాశివంను నియమిస్తారన్న ప్రచారం హస్తినలో జోరుగా సాగుతోంది. ఈరోజే ఉత్తర్వులు [more]

Update: 2019-09-01 03:29 GMT

తెలంగాణ గవర్నర్ నరసింహన్ ను మార్చే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. ఆయన స్థానంలో కేరళ గవర్నర్ సదాశివంను నియమిస్తారన్న ప్రచారం హస్తినలో జోరుగా సాగుతోంది. ఈరోజే ఉత్తర్వులు వెలువడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు తర్వాత తెలంగాణ రాష్ట్రానికి నరసింహన్ పదేళ్ల నుంచి గవర్నర్ గా పనిచేస్తున్నారు. ఆయన యూపీఏ హయాంలో నియమితులైనా ఎన్డీఏ ప్రభుత్వం కూడా కంటిన్యూ చేస్తూ వస్తోంది. అయితే నరసింహన్ ను మార్చి ఆయన స్థానంలో కొత్తవారిని నియమించాలని రాష్ట్ర బీజేపీ నేతలూ కోరుతున్నారు. కేసీఆర్ తో సఖ్యతగా ఉండటంతోనే బీజేపీ నేతలు గవర్నర్ పై కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదు చేశారు. దీంతో గవర్నర్ ను మారుస్తారన్న ప్రచారం జరుగుతోంది. నరసింహన్ ను ఎక్కడ నియమిస్తారన్నది ఇంకా తెలియరాలేదు.

Tags:    

Similar News