ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం

ఏలూరు ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ప్రభుత్వ వైఫల్యమే చిన్నారులు [more]

Update: 2020-12-06 06:49 GMT

ఏలూరు ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ప్రభుత్వ వైఫల్యమే చిన్నారులు అస్వస్థతకు గురయ్యారన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ప్రజలు అస్వస్థతకు గురయ్యారన్నారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సొంత నియోజకవర్గంలోనే ప్రజలకు ఆరోగ్య భద్రత లేకపోతే ఇక రాష్ట్రంలో ఎలా ఉంటుంది అని నారా లోకేష్ ప్రశ్నించారు. వెంటనే ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యం కల్పించాలని లోకేష్ డిమాండ్ చేశారు.

Tags:    

Similar News