నేడు రాజధానిలో నారా లోకేష్

రాజధాని రైతుల ఆందోళన 300వ రోజుకు చేరకుంది. దీంతో రైతులకు సంఘీభావంగా టీడీపీ నేత నారా లోకేష్ పర్యటించనున్నారు. రాజధాని ప్రాంత గ్రామాల్లో నారా లోకేష్ పర్యటించి [more]

Update: 2020-10-12 02:44 GMT

రాజధాని రైతుల ఆందోళన 300వ రోజుకు చేరకుంది. దీంతో రైతులకు సంఘీభావంగా టీడీపీ నేత నారా లోకేష్ పర్యటించనున్నారు. రాజధాని ప్రాంత గ్రామాల్లో నారా లోకేష్ పర్యటించి వారికి అండగా నిలవనున్నారు. మరోవైపు చంద్రబాబు పార్టీ కార్యాలయం నుంచి జూమ్ యాప్ ద్వారా రైతులతో మాట్లాడనున్నారు. రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని కోరుతూ రైతులు చేస్తున్న నిరసనలు నేటికి 300వ రోజుకు చేరుకున్నాయి. నారా లోకేష్ నేడు నిరసనలు జరుగుతున్న రాజధాని ప్రాంతంలోని అన్ని గ్రామాల్లో పర్యటించనున్నారు.

Tags:    

Similar News