ఇక్కడ బాగుంటే అక్కడకు ఎందుకు వెళతారు?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఏపీలో కరోనా రోగులకు వైద్యం అందడం [more]

Update: 2021-05-15 00:55 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఏపీలో కరోనా రోగులకు వైద్యం అందడం లేదని చెప్పారు. రాష్ట్రంలో వైద్య సదుపాయాలు సక్రమంగా లేనందుకే ఏపీ నుంచి తెలంగాణకు ప్రజలు వెళుతున్నారని లోకేష్ అన్నారు. ఏపీలోనే మెరుగైన వైద్యం దొరికితే హైదరాబాద్ కు పోవాల్సిన అవసరమేముందని లోకేష్ ప్రశ్నించారు. ఇప్పటికైనా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడి సరిహద్దుల నుంచి అంబులెన్స్ లను హైదరాబాద్ లోకి అనుమతించేలా చూడాలని లోకేష్ కోరారు. ఇంత చేతకాని దద్దమ్మ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రానికి ఉండకూడదని లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు

Tags:    

Similar News