ప్రజలను జగన్ ఏప్రిల్ ఫూల్ చేశారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. జగన్ పాలనలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. అనేక [more]

Update: 2021-04-02 00:57 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. జగన్ పాలనలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. అనేక హామీలిచ్చిన జగన్ వాటిని అమలు పర్చకుండా ప్రజలను ఏప్రిల్ ఫూల్ చేశారని నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. తన కేసుల కోసం ప్రత్యేక హోదాను కేంద్ర ప్రభుత్వం వద్ద తాకట్టు పెట్టారని లోకేష్ ఆరోపించారు. తన కుల పత్రికల్లో తెలుగుదేశం విలీనం అంటూ తప్పుడు వార్తలు రాయిస్తున్నారని జగన్ పై లోకేష్ మండి పడ్డారు.

Tags:    

Similar News