లోకేష్ ట్వీట్ లో వైఎస్

Update: 2018-06-13 03:37 GMT

వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును ఉపయోగించుకుంటూ వైసీపీ నేతలు ప్రజలను మోసం చేస్తున్నారని మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. పోలవరం పనులను చంద్రబాబునాయుడు చిత్తశుద్ధితో వేగంగా పూర్తి చేస్తుంటే సిగ్గు లేకుండా వైఎస్ హయాంలోనే పనులు వేగంగా జరిగాయని చెప్పడాన్ని లోకేష్ తప్పుపట్టారు. వైఎస్ కల పోలవరం అంటూ ఆయన పేరును తెస్తున్నారన్నారు. ఇదంతా చూస్తుంటే విజయానికి మాత్రం ఎంతో మంది తండ్రులని, అపజయం మాత్రం అనాధ అన్నది తనకు గుర్తుకు వస్తుందని లోకేష్ ట్విట్టర్లో ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టు ఇప్పటికే 55 శాతం పూర్తయిందన్న విషయాన్ని గుర్తు చేశారు.

Similar News