300 మంది పులివెందుల రౌడీలు వచ్చి…?

విశాఖ ఎయిర్ పోర్టులో చంద్రబాబును అడ్డుకున్నది మూడు వందల మంది పులివెందుల రౌడీలని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. అందరిపై కేసులు పెట్టారన్నారు. ఇక [more]

Update: 2020-03-02 11:55 GMT

విశాఖ ఎయిర్ పోర్టులో చంద్రబాబును అడ్డుకున్నది మూడు వందల మంది పులివెందుల రౌడీలని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. అందరిపై కేసులు పెట్టారన్నారు. ఇక జగన్ వచ్చిన తర్వాతనే రాజధాని అమరావతికి ఇబ్బందులు తలెత్తాయని చెప్పారు. జగన్ వేసిన రెండు కమిటీలు విశాఖ పట్నం రాజధానికి అనుకూలం కాదని తేల్చి చెప్పాయన్నారు. రాజధాని మార్పుపై రైతులతో చర్చించరా? అని లోకేష్ ప్రశ్నించారు. అమాయక రైతులపై కేసులు నమోదు చేశారని లోకేష్ వైసీప ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. జగన్ ప్రభుత్వం అరాచకాలు ఎన్నాళ్లో కొనసాగవని, ప్రజలు తిరగబడే రోజు వస్తుందని లోకేష్ అన్నారు.

Tags:    

Similar News