బ్రేకింగ్ : రేపు ఢిల్లీకి బాబు...ఎందుకంటే....?

Update: 2018-10-26 10:57 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రేపు ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు. గవర్నర్ నరసింహన్ తీరును ఎండగట్టడానికే ఆయన ఢిల్లీ ప్రయాణం ప్రధానంగా సాగనుంది. నిన్న విశాఖ ఎయిర్ పోర్ట్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగిన సంఘటనపై గవర్నర్ నేరుగా రాష్ట్ర డీజీపీతో మాట్లాడటాన్ని చంద్రబాబు తప్పుపడుతున్నారు. గవర్నర్ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం నీరుగారుస్తుందని చంద్రబాబు విమర్శించారు. ఈ నేపథ్యంలో గవర్నర్ వ్యవస్థపై జాతీయ స్థాయిలో పోరాటం చేసేందుకు చంద్రబాబు ఢిల్లీ వెళుతున్నారు. ఈ సందర్భంగా పలు జాతీయ పార్టీల నేతలను కలిసి గవర్నర్ వ్యవహరించిన తీరును వివరించనున్నారు. నిన్ననే చంద్రబాబు గవర్నర్ వ్యవస్థకు వ్యతిరేకంగా తాము ఆందోళన చేపట్టనున్నట్లు మీడియా సమావేశంలో చెప్పారు. రేపు ఢిల్లీ చేరుకునే చంద్రబాబు జాతీయ పార్టీలను కలిసి ఉద్యమ కార్యాచరణను రూపొందించనున్నట్లు తెలుస్తోంది.

Similar News