గాలి కుటుంబానికి బాబు వార్నింగ్

Update: 2018-10-06 13:28 GMT

చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నేతలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కొద్దిసేపటి క్రితం సమావేశమయ్యారు. అయితే కొద్దికాలం మృతిచెందిన గాలి ముద్దుకృష్ణమ నాయుడి కుటుంబంలో విభేదాలు వచ్చాయి. వారసత్వం ఎవరనేది వారు తేల్చుకోలేకపోతున్నారు. దీంతో ఇప్పటి వరకూ నగరి నియోజకవర్గ ఇన్ ఛార్జిని చంద్రబాబు ప్రకటించలేదు. నేటి సమావేశంలో ఇదే అంశాన్ని ప్రస్తావించారు. తొలుత కుటుంబంలో విభేదాలను పరిష్కరించుకుని తన వద్దకు రావాలని, అలా వస్తేనే ఇన్ ఛార్జి బాధ్యతలను గాని, టిక్కెట్ కాని దక్కుతుందని చంద్రబాబు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. విభేదాలు పరిష్కరించుకోకుంటే వేరొకరికి టిక్కెట్ ఇవ్వాల్సి ఉంటుందని కూడా వార్నింగ్ ఇచ్చారు. నగరి టిక్కెట్ కోసం గాలి ముద్దు కృష్ణమనాయుడు కుమారులు జగదీష్, భానుప్రకాష్ లిద్దరూ పోటీ పడుతున్నారు. దీంతో ఫ్యామిలీలోనే ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవాలని బంతి వారి కోర్టులోకే బాబు నెట్టేశారు.

Similar News