వైసీపీకి బాలయ్య వార్నింగ్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వార్నింగ్ ఇచ్చారు. హిందూపురంలో నిన్న తాను ఒక్క సైగ చేస్తే ఏమయి ఉండేదని అన్నారు. తన వెనక ఎంతమంది [more]

Update: 2020-01-31 06:34 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వార్నింగ్ ఇచ్చారు. హిందూపురంలో నిన్న తాను ఒక్క సైగ చేస్తే ఏమయి ఉండేదని అన్నారు. తన వెనక ఎంతమంది ఉన్నా తాను సహనంతో ఉన్నానని బాలకృష్ణ చెప్పారు. తన సహనాన్ని చేతకాని తనంగా భావించవద్దని బాలకృష్ణ తెలిపారు. రాజకీయ కక్షలతో సాగితే అభివృద్ధి సాధ్యం కాదని బాలకృష్ణ గుర్తు చేశారు. నిన్న హిందూపురంలో బాలకృష్ణ పర్యటనను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్న సంగతి తెలిసిందే. మూడు రాజధానులకు వ్యతిరేకంగా టీడీపీ తీసుకున్న నిర్ణయంతో వైసీపీ హిందూపురంలో ఆందోళనకు దిగింది. దేశంలో ఎక్కడైనా ఒకే రాజధాని ఉంటుందని, తండ్రి శాసనమండలిని పునరుద్ధరిస్తే కొడుకు దానిని రద్దు చేస్తున్నాడని ఎద్దేవా చేశారు.

Tags:    

Similar News