బ్రేకింగ్ : ఆ 5.24 కోట్లు నావేనంటున్నాడు

చెన్నైలో దొరికిన 5.27 కోట్ల నగదు తనదేనని ఒంగోలుకు చెందిన నల్లమిల్లి బాబు తెలిపారు. నల్లమిల్లి బాబు వైసీపీకి చెందిన వారు. నల్లమల్లి బాబు బంగారు వ్యాపారి. [more]

Update: 2020-07-16 06:53 GMT

చెన్నైలో దొరికిన 5.27 కోట్ల నగదు తనదేనని ఒంగోలుకు చెందిన నల్లమిల్లి బాబు తెలిపారు. నల్లమిల్లి బాబు వైసీపీకి చెందిన వారు. నల్లమల్లి బాబు బంగారు వ్యాపారి. ఎన్.వి.ఆర్ జ్యుయలరీ పేరుతో వ్యాపారం చేస్తున్నారు. బంగారం కొనుగోలు చేసేందుకు తాను ఆ డబ్బును చెన్నైకి పంపానని నల్లమిల్లి బాబు తెలిపారు. దీంతో ఆదాయపు పన్ను శాఖ అధికారులు చెన్నై నుంచి ఒంగోలు బయలుదేరారు. ఆయన ప్రశ్నించిన తర్వాత దీనిపై స్పష్టతరానుంది. అయితే పట్టుబడిన సొమ్ముకు ఎలాంటి లెక్కలు లేవని చెబుతున్నారు. వైసీపీ నేత కావడంతో ఎమ్మెల్యే అన్నా రాంబాబుస్టికర్ ఉండటంతో వైసీపీ ఎమ్మెల్యే నగదుగా తొలుత భావించారు. కాని నల్లమిల్లి బాబు సొమ్ముపై క్లారిటీ ఇవ్వడంతో చిక్కుముడి వీడిపోయింది.

Tags:    

Similar News