గంటల్లోనే నాలుగు హత్యలు… హైదరాబాద్ లో మళ్లీ?

హైదరాబాద్ లో గంటల వ్యవధిలో హత్యలు జరిగాయి. కొన్ని గంటల వ్యవధిలోనే నాలుగు హత్యలు జరగడంతో తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది. కక్షలతో నాలుగు హత్యలు జరిగినట్లుగా పోలీసు [more]

Update: 2020-06-06 01:38 GMT

హైదరాబాద్ లో గంటల వ్యవధిలో హత్యలు జరిగాయి. కొన్ని గంటల వ్యవధిలోనే నాలుగు హత్యలు జరగడంతో తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది. కక్షలతో నాలుగు హత్యలు జరిగినట్లుగా పోలీసు అధికారులు చెబుతున్నారు. చెల్లెలి మిత్రుడు ను అవమానపరచడం కోపంతో మిత్రుని చంపేసి పారిపోయాడు ఒక ప్రబుద్ధుడు. నడిరోడ్డు మీద కత్తులతో ఒక వ్యక్తిని నరికి చంపిన సంఘటన పాతబస్తీలో చోటు చేసుకుంది. రౌడీ షీటర్ ల మధ్య ఆధిపత్య పోరు లో ఇద్దరు రౌడీలను రోడ్డు మీద అడ్డంగా నరికివేసిన సంఘటన లంగర్ హౌస్ లో జరిగింది . మొత్తానికి నాలుగు హత్యలు నగరంలో సంచలనం రేకెత్తిస్తున్నాయి. లాక్ డౌన్ లో ఒకేసారి నాలుగు హత్యలు జరగడంతో సిటీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎక్కడకక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. నడిరోడ్డు మీద ఇబ్రహీం చాంద్ ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇద్దరు కలిసి రోడ్డు మీద ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు . ఈ దాడుల్లో చాంద్ మహబూబ్ తో పాటుగా మరొక రౌడీషీటర్ అబు అక్కడికక్కడే చనిపోయారు. ఈ సంఘటనతో లంగర్ హౌస్ ప్రాంతంలో కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు గోల్కొండ లో రాహుల్ ని ప్రాణ మిత్రుడైన హాజారే అతి కిరాతకంగా చంపి పారిపోయాడు. ఇదిలా ఉంటే రెయిన్ బజార్ లో నడిరోడ్డు మీద ఒక వ్యక్తిని నరికి చంపిన సంఘటన వెలుగులోకి వచ్చింది.

Tags:    

Similar News