‘ఎన్టీఆర్’ వేదికపై మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు

Update: 2018-12-21 14:10 GMT

దివంగత నందమూరి తారకరామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్’ ఆడియో, ట్రైలర్ విడుదల కార్యక్రమం ఇవాళ హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ తో అనుబంధం ఉన్న నటులు, వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదికపై నటుడు మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ తో తనకు ఎంతో అనుబంధం ఉందని, ఈ అనుబంధంలో కొన్ని నిజాలు ఉన్నాయి కానీ ఇప్పుడు చెప్పలేనని పేర్కొన్నారు. ఓ సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అంతా ఎన్టీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చెస్తున్నప్పుడు తానొక్కడినే ఎన్టీఆర్ జిందాబాద్ అని నినాదాలు చేశానని గుర్తు చేశారు. ప్రసంగం ముగిస్తున్న సందర్భంలో దర్శకుడు క్రిష్ కి ధన్యవాదాలు తెలుపుతూ... ఈ సినిమాలో ఎవరిని ఎలా చూపించారో తెలియదని, చెడ్డ వారిని కూడా మంచి వారిగా చూపించారేమో తెలియదని పేర్కొనడం ఆసక్తికరంగా మారింది.

Similar News