టీడీపీపై వెల్లంపల్లి సీరియస్ కామెంట్స్

ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ టీడీపీ నేతలపై సీరియస్ కామెంట్స్ చేశారు. తమ పై అవినీతి ఆరోపణలు చేయడం మానుకోవాలని ఆయన కోరారు. ఇంట్లో తాగి పడుకునే [more]

Update: 2020-07-17 05:44 GMT

ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ టీడీపీ నేతలపై సీరియస్ కామెంట్స్ చేశారు. తమ పై అవినీతి ఆరోపణలు చేయడం మానుకోవాలని ఆయన కోరారు. ఇంట్లో తాగి పడుకునే దద్దమ్మలు తమను అనడమేంటని వెల్లంపల్లి ప్రశ్నించారు. కార్మికుల సొమ్మును దోచుకున్నందుకే అచ్చెన్నాయుడు జైలుకు వెళ్లారన్నారు. ఏ మంత్రి అవినీతికి పాల్పడినా జగన్ వెంటనే చర్యలు తీసుకుంటారని చెప్పారు. దుర్గగుడి ఫ్లై ఓవర్ పనులు 30 శాతం పూర్తయ్యాయన్నారు. ఆగస్టు 30వ తేదీనాటికి ఫ్లై ఓవర్ ప్రారంభిస్తామని వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్పారు. విజయవాడకు ఎంపీ కేశినేని నాని ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామని జగన్ హామీ ఇచ్చారని, అందరితో చర్చించి ఆయన దీనిపై నిర్ణయం తీసుకుంటారని వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్పారు.

Tags:    

Similar News