ఇదే ఫైనల్ వార్నింగ్

ఆర్టీసీ ఉద్యోగులను మంత్రి పువ్వాడ అజయ్ హెచ్చరించారు. సాయంత్రం 6 గంటల్లోగా విధుల్లో చేరని కార్మికులు ఇక ఆర్టీసీ ఉద్యోగులు కారని, భవిష్యత్తులో కూడా వారిని ఆర్టీసీ [more]

Update: 2019-10-05 09:59 GMT

ఆర్టీసీ ఉద్యోగులను మంత్రి పువ్వాడ అజయ్ హెచ్చరించారు. సాయంత్రం 6 గంటల్లోగా విధుల్లో చేరని కార్మికులు ఇక ఆర్టీసీ ఉద్యోగులు కారని, భవిష్యత్తులో కూడా వారిని ఆర్టీసీ ఉద్యోగులుగా సంస్థ గుర్తించదని హెచ్చరించారు. ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్టీసీపై ప్రత్యామ్నాయ విధానం ఖరారుకు ఆదివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు….

శాశ్వత ప్రత్యామ్నాయ రవాణా విధానానికి రూపకల్పన చేస్తున్నట్లు పువ్వాడ అజయ్ వెల్లడించారు. ప్రభుత్వ పరిశీలనలో మూడు ప్రత్యామ్నాయాలు ఉన్నాయని తెలిపారు. 4 వేల ప్రైవేటు బస్సులను అద్దెకు తీసుకుని ఆర్టీసీ బస్సులు నడుపుతామని అజయ్ చెప్పారు. ఇందుకోసం అర్హుల నుంచి దరఖాస్తులు కోరుతామని, వారికి తక్షణం శిక్షణ ఇచ్చి బస్సులను యథావిధంగా నడపుతామని చెప్పారు. 7 వేల ప్రైవేటు బస్సులకు రూట్ పర్మిట్లు ఇస్తామని అజయ్ వివరించారు.

 

Tags:    

Similar News