ఏపీ మంత్రికి కరోనా పాజటివ్

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి కరోనా వైరస్ [more]

Update: 2020-08-05 02:15 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి కరోనా వైరస్ సోకింది. వారం రోజుల నుంచి స్వల్ప జ్వరం ఉండటంతో ఆయన కరోనా పరీక్షలు చేయించుకున్నారు. దీంతో బాలినేనికి కరోనా పాజిటివ్ గా తేలింది. ఆయన చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ఆయన కుటుంబ సభ్యులతో పాటు, సన్నిహితులు కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. తనతో వారం రోజల నుంచి సన్నిహితంగా ఉన్న వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని బాలినేని శ్రీనివాసరెడ్డి కోరారు.

Tags:    

Similar News