జగన్ బిక్ష అది… నచ్చకపోతే రాజీనామా చేయండి

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు మంత్రి అవంతి శ్రీనివాస్ గట్టి కౌంటర్ ఇచ్చారు. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించారు. నర్సాపురం రాజకీయాల వరకే పరిమితమయితే బాగుంటుందని [more]

Update: 2020-07-26 06:55 GMT

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు మంత్రి అవంతి శ్రీనివాస్ గట్టి కౌంటర్ ఇచ్చారు. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించారు. నర్సాపురం రాజకీయాల వరకే పరిమితమయితే బాగుంటుందని అవంతి శ్రీనివాస్ సూచించారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని చెప్పడానికి మీరెవరని ప్రశ్నించారు. జగన్ ఇమేజ్ తో నాగబాబుపై గెలిచిన రఘు రామకృష్ణంరాజు, ఆయన గెలుపు జగన్ బిక్ష అనే విషయాన్ని గుర్తుంచకోవాలన్నారు. తమకు సంబంధం లేని విషయాలను ప్రస్తావిస్తున్నారని అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. కరోనా ఎవరికైనా వస్తుంది, పోతుందని, దానిని కూడా రాజకీయాలకు వాడుకోవడం మంచిది కాదని అవంతి శ్రీనివాస్ హితవు పలికారు. పార్టీ విధానాలు నచ్చకపోతే రాజీనామా చేసి వెళ్లిపోవాలని, నోటి దురుసుతనం తగ్గించుకోవాలని కోరారు.

Tags:    

Similar News