వివేకా మృతిపై ఆరోపణలొస్తున్నాయ్…!!!

వైసీపీ నేత వివేకానందరెడ్డి మరణంపై ఆరోపణలు వస్తున్నాయని, ఈ ఘటనపై విచారణ జరిపించాలని మంత్రి ఆదినారాయణరెడ్డి డిమాండ్ చేశారు. ఈ ఘటన వెనుక దోషులను కఠినంగా శిక్షించాలని [more]

Update: 2019-03-15 07:55 GMT

వైసీపీ నేత వివేకానందరెడ్డి మరణంపై ఆరోపణలు వస్తున్నాయని, ఈ ఘటనపై విచారణ జరిపించాలని మంత్రి ఆదినారాయణరెడ్డి డిమాండ్ చేశారు. ఈ ఘటన వెనుక దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన పేర్కొన్నారు. గతంలో జగన్ పై దాడి జరిగినప్పుడూ తనపై ఆరోపణలు చేశారని, తప్పుడు ఆరోపణలు చేయడం జగన్ కు అలవాటేనని అన్నారు. తప్పులను పక్కవారిపై నెట్టడం దర్మార్గమన్నారు. ఎన్నికలను నిజాయితీగా ఎదుర్కోలేక ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. కడప లోక్ సభ స్థానంపై వైఎఎస్ కుటుంబంలో విభేదాలు తలెత్తాయన్నారు. అవినాష్ రెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డిల మధ్య సీట్ల పోటీ జరుగుతుందన్నారు. వివేకానందరెడ్డి మృతి బాధాకరమన్నారు. తప్పులను పక్క వారిపై నెట్టడం దుర్మార్గమన్నారు.

Tags:    

Similar News