మసూద్ మరణం డ్రామానా?

జైషే మహ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజర్ మృతి చెందాడా? ఇటీవల భారత్ బాలాకోట్ లో జరిపిన ఎయిర్ స్ట్రయిక్స్ లో మరణించిన వారిలో కూడా మసూద్ ఉన్నారా? [more]

Update: 2019-03-03 13:04 GMT

జైషే మహ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజర్ మృతి చెందాడా? ఇటీవల భారత్ బాలాకోట్ లో జరిపిన ఎయిర్ స్ట్రయిక్స్ లో మరణించిన వారిలో కూడా మసూద్ ఉన్నారా? అవుననే అంటున్నాయి పాక్ మీడియా కథనాలు. పాకిస్థాన్ దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ మసూద్ మరణించారన్న వార్తలు మాత్రం అంతర్జాతీయంగా హల్ చల్ చేస్తున్నాయి. అయితే మసూద్ అజార్ పాక్ లోనే తన ఇంట్లో సురక్షితంగా ఉన్నారని, ఆయన నడవలేని పరిస్థితుల్లో ఉన్నారని పాక్ విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషీ ప్రకటించిన సంగతి తెలిసిందే. మసూద్ అజార్ గత కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడని, ఆయన డయాలసిస్ చికిత్స పొందుతున్నారని కథనాలు వెలువడ్డాయి. మసూద్ మరణించినట్లు పాక్ మరో కుట్రలో భాగమేనంటూ అభిప్రాయాలూ కూడా వ్యక్తమవుతున్నాయి.

Tags:    

Similar News