మొత్తం అభ్యర్థులను ప్రకటించిన మమత

తాను రానున్న ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచే పోటీ చేస్తానని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ప్రకటించారు. దీంతో పాటు పశ్చిమ బెంగాల్ లోని 294 నియోజకవర్గాలకు [more]

Update: 2021-03-06 00:58 GMT

తాను రానున్న ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచే పోటీ చేస్తానని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ప్రకటించారు. దీంతో పాటు పశ్చిమ బెంగాల్ లోని 294 నియోజకవర్గాలకు మమత బెనర్జీ తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. వీరిలో యాభై మంది మహిళలు, 42 మంది ముస్లింలు, 79 మంది ఎస్.సిలు, 17 మంది ఎస్టీలు ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో భవానీపూర్ నుంచి కాకుండా నందిగ్రామ్ నుంచి మమత బెనర్జీ పోటీ చేయాలని నిర్ణయించుకోవడం విశేషం.

Tags:    

Similar News