బ్రేకింగ్ : కాసేపట్లో గవర్నర్ వద్దకు కమల్ నాధ్

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాధ్ కాసేపట్లో రాష్ట్ర గవర్నర్ ను కలవనున్నారు. బడ్జెట్ సమావేశాలను వాయిదా వేయాలని కోరనున్నారు. కరోనా ఎఫెక్ట్ కారణంగా బడ్జెట్ సమావేశాలను వాయిదా [more]

Update: 2020-03-13 05:45 GMT

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాధ్ కాసేపట్లో రాష్ట్ర గవర్నర్ ను కలవనున్నారు. బడ్జెట్ సమావేశాలను వాయిదా వేయాలని కోరనున్నారు. కరోనా ఎఫెక్ట్ కారణంగా బడ్జెట్ సమావేశాలను వాయిదా వేయాలని కమల్ నాధ్ గవర్నర్ కు విజ్ఞప్తి చేయనున్నారు. కాగా మధ్యప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అదే రోజు కమల్ నాధ్ బలాన్ని సభలో నిరూపించుకోవాలని బీజేపీ కోరనుంది. దీంతో కొంత వెసులుబాటు కల్పించుకునేందుకు కమల్ నాధ్ బడ్జెట్ సమావేశాలను వాయిదా వేయాలని నిర్ణయించారు. గవర్నర్ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News