పోలింగ్ 45.71శాతం.. రేపు రీపోలింగ్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో అతి తక్కువ పోలింగ్ నమోదయింది. మొత్ంత 45,71 శాతం పోలింగ్ జరిగినట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. 2016 ఎన్నికలకంటే కొంత ఎక్కువగానే [more]

Update: 2020-12-02 02:37 GMT

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో అతి తక్కువ పోలింగ్ నమోదయింది. మొత్ంత 45,71 శాతం పోలింగ్ జరిగినట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. 2016 ఎన్నికలకంటే కొంత ఎక్కువగానే నమోదయినట్లు అధికారులు వెల్లడించారు. 2016 ఎన్నికల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 45,29 శాతం మాత్రమే పోలింగ్ జరిగిందని అధికారులు పేర్కొన్నారు. ఈనెల 4వ తేదీన కౌంటింగ్ జరగనుంది. కాగా ఓల్డ్ మలక్ పేట్ లోని బూత్ నెంబరు 26లో నిలిచిపోయిన పోలింగ్ ను రేపు నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు.

Tags:    

Similar News