ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ కి మొదటి ర్యాంకు రావడంపై విమర్శలు చేసిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై ఏపీ మంత్రి నారా లోకేష్ విరుచుకుపడ్డారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి ఆయనని అడిగితే ఏమి తెలుస్తుందని, క్విడ్ ప్రోకో విధానంలో అవినీతి, అక్రమ సంపాదన గురించి అడిగితే జగన్ బాగా సమాధానం చెబుతారని ఆయన ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు.