ఏపీలో ఇక్కడ మళ్లీ లాక్ డౌన్ తప్పదా?

ఆంధ్రప్రదేశ్ లో లాక్ డౌన్ మినహాయింపులు ఇచ్చారు. ప్రస్తుతం నైట్ కర్ఫ్యూ మాత్రమే కొనసాగుతుంది. అయితే తూర్పు గోదావరి జిల్లాలో మాత్రం కరోనా కేసులు తగ్గడం లేదు. [more]

Update: 2021-07-22 04:07 GMT

ఆంధ్రప్రదేశ్ లో లాక్ డౌన్ మినహాయింపులు ఇచ్చారు. ప్రస్తుతం నైట్ కర్ఫ్యూ మాత్రమే కొనసాగుతుంది. అయితే తూర్పు గోదావరి జిల్లాలో మాత్రం కరోనా కేసులు తగ్గడం లేదు. రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నాయి. గడిచిన ఇరవై రోజుల్లో తూర్పుగోదావరి జిల్లాలో పదివేలకు పైగా కేసులు నమోదవ్వడం ఆందోళన కల్గిస్తుంది. దీంతో తిరిగి ఈ జిల్లాలో లాక్ డౌన్ విధించాలని అధికారులు భావిస్తున్నారు. తాజాగా కొన్ని మండలాల్లో మధ్యాహ్నం రెండు గంటల నుంచే కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. అయినా కేసులు తగ్గకపోవడంతో లాక్ డౌన్ పెట్టే యోచనలో అధికార యంత్రాంగం ఉంది.

Tags:    

Similar News