పార్టీలతో సంబంధం లేదు… ప్లీజ్ వదిలేయండి

తనకు ఏపార్టీతో సంబంధం లేదని తనను, తన కుటుంబాన్ని మానసికంగా వేధించడం మానుకోవాలని ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. [more]

Update: 2019-09-25 05:10 GMT

తనకు ఏపార్టీతో సంబంధం లేదని తనను, తన కుటుంబాన్ని మానసికంగా వేధించడం మానుకోవాలని ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. కరకట్ట పై ఉన్న తన గెస్ట్ హౌస్ ను కూల్చివేయనున్నట్లు ప్రచారం జరుగుతుందని, సీఆర్డీఏ నోటీసులకు తాను సమాధానం ఇచ్చానని తెలిపారు. తాను ఏ ముఖ్యమంత్రి ఉన్నా పార్టీలతో సంబంధం లేకుండా తన గెస్ట్ హౌస్ ను ఇచ్చేవాడినని చెప్పారు. తాను ఒక బాధ్యత గల పౌరుడిగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కోరితేనే తన గెస్ట్ హౌస్ ను ఇచ్చానన్నారు. తనకు ఏ పార్టీలతో సంబంధం లేదన్నారు. ఇప్పటికైనా తనను చంద్రబాబు బినామీగా చూడటం మానుకోవాలని లింగమనేని రమేష్ జగన్ కు రాసిన లేఖలో కోరారు. తన భవనాన్ని కూల్చివేసే విషయంలో జరుగుతున్న ప్రచారాన్ని నిలిపేయాలని కోరారు.

Tags:    

Similar News