లాస్ట్ డే జగన్….?

జగన్ ప్రజాసంకల్ప యాత్ర చివరిరోజు ప్రారంభమయింది. ఆయన బస చేసిన శిబిరం వద్దకు పెద్దయెత్తున కార్యకర్తలు తరలి వచ్చారు. ఇప్పటికే ఇచ్ఛాపురం మొత్తం వైసీపీ కార్యకర్తలు, నేతలతో [more]

Update: 2019-01-09 03:39 GMT

జగన్ ప్రజాసంకల్ప యాత్ర చివరిరోజు ప్రారంభమయింది. ఆయన బస చేసిన శిబిరం వద్దకు పెద్దయెత్తున కార్యకర్తలు తరలి వచ్చారు. ఇప్పటికే ఇచ్ఛాపురం మొత్తం వైసీపీ కార్యకర్తలు, నేతలతో నిండిపోయింది. 341 రోజులు ప్రజాసంకల్ప యాత్ర చేసిన జగన్ ఈరోజు ముగించనున్నారు. జగన్ శిబిరం వద్దకు చేరుకుని ఆయనకు నేతలు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన 175 నియోజకవర్గాల నుంచి పెద్దయెత్తున కార్యకర్తలు హాజరయ్యారు. పెద్ద కొజ్జిరియా గ్రామంలోని తన శిబిరం వద్ద వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. జగన తో సెల్పీలు దిగేందుకు యువతీయువకులు పోటీ పడ్డారు. మరికొద్ది గంటల్లోనే జగన్ ప్రజాసంకల్పయాత్ర ముగియనుంది. 2017 నవంబరు 6వ తేదీన ప్రారంభమయిన యాత్ర ఈరోజు ముగియనుంది. ఈ సందర్భంగా ఇచ్ఛాపురంలో భారీ బహిరంగ సభ జరనుంది.

Tags:    

Similar News