ఇది రెండో వెన్నుపోటు

Update: 2018-11-03 07:50 GMT

కాంగ్రెస్ కి వ్యతిరేకంగా, తెలుగువారి ఆత్మగౌరవం కోసం పుట్టిన తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కి మరోసారి వెన్నుపోటు పొడిచారని ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. టీడీపీ - కాంగ్రెస్ పొత్తుకు నిరసనగా ఆమె శనివారం ఎన్టీఆర్ సమాధి వద్ద నిరసనకు దిగారు. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం ద్వారా ఎన్టీఆర్ పేరు, ఎన్టీఆర్ ఫోటోను వాడుకునే అర్హతను చంద్రబాబు కోల్పోయారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఆశయాలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని, ఈ సంఘటన చూసి ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందన్నారు. కేవలం స్వార్థ రాజకీయాల కోసమే కాంగ్రెస్ తో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. ఈ మేరకు ఆమె లేఖ రాసి ఎన్టీఆర్ సమాధి వద్ద పెట్టారు.

Similar News