రేవంత్ అనుచరులకు జానా పరోక్ష హెచ్చరిక

కాంగ్రెస్ లో నేతలను అవమానిస్తుంటే చూస్తూ ఊరుకోబోమని సీనియర్ నేత జానారెడ్డి హెచ్చరించారు. సోషల్ మీడియాలో కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ నేతలు అవమానపరుస్తూ పోస్టింగ్ లు పెట్టడంపై [more]

Update: 2021-02-26 01:55 GMT

కాంగ్రెస్ లో నేతలను అవమానిస్తుంటే చూస్తూ ఊరుకోబోమని సీనియర్ నేత జానారెడ్డి హెచ్చరించారు. సోషల్ మీడియాలో కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ నేతలు అవమానపరుస్తూ పోస్టింగ్ లు పెట్టడంపై జానారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏదైనాసమస్యలుంటే అంతర్గతంగా చర్చించకోవాలని, బహిరంగంగా ఈ విమర్శలేంటని జానారెడ్డి చికాకు వ్యక్తం చేశారు. వారిపై పీసీసీ చర్యలు తీసుకోవాలని కోరారు. పీసీసీ చర్యలు తీసుకోకపోతే తాను హైకమాండ్ కు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. నేతల మనోభావాలను కించపర్చేలా కొందరు కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టడమేంటని జానారెడ్డి ప్రశ్నించారు. కాగా జానారెడ్డి రేవంత్ రెడ్డి అనుచరులను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.

Tags:    

Similar News