కాంగ్రెస్ నన్ను అవమానిస్తోంది… రాజీనామాకు సిద్ధం

కర్ణాటకలో రాజకీయ సంక్షోభం ముదురుతోంది. కాంగ్రెస్ తో దోస్తీ పట్ల ముఖ్యమంత్రి కుమారస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తనను అవమానిస్తోందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ తో కలిసి [more]

Update: 2019-01-28 06:56 GMT

కర్ణాటకలో రాజకీయ సంక్షోభం ముదురుతోంది. కాంగ్రెస్ తో దోస్తీ పట్ల ముఖ్యమంత్రి కుమారస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తనను అవమానిస్తోందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ తో కలిసి ఉండడం కష్టమని తనకు తెలుసని, ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయేందుకు సిద్ధంగా ఉన్నానని కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా వారి ఎమ్మెల్యేలను నియంత్రణలో ఉంచుకోవాలని హితవు పలికారు. కర్ణాటకలో ఎన్నికల తర్వాత కాంగ్రెస్ తో పొత్తు కుదుర్చుకొని కుమారస్వామి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ కు సమీపంలో ఉన్న ఈ ప్రభుత్వం బలం అంతర్గత గొడవలతో ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేని పరిస్థితి.

Tags:    

Similar News