ఇలాగే ధైర్యంగా పోరాడండి…కోట్ల పిలుపు

పంచాయతీ ఎన్నికల్లో చూపించిన శ్రద్ధను రాబోయే ఎన్నికల్లోనూ చూపించాలని మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశరెడ్డి పిలుపు నిచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ కార్యకర్తలు ధైర్యంగా పోరాడారన్నారు. [more]

Update: 2021-02-15 01:51 GMT

పంచాయతీ ఎన్నికల్లో చూపించిన శ్రద్ధను రాబోయే ఎన్నికల్లోనూ చూపించాలని మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశరెడ్డి పిలుపు నిచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ కార్యకర్తలు ధైర్యంగా పోరాడారన్నారు. కోడుమూరు సర్పంచ్ గా గెలిచిన భాగ్యరత్నను కోట్ల సూర్య ప్రకాశరెడ్డి అభినందించారు. రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ ఇదే పంథాను కొనసాగించాలని ఆయన కోరారు. ఎప్పుడైనా నీతి గెలుస్తుందని, అవినీతి ఓడిపోతుందని కోట్ల సూర్యప్రకాశరెడ్డి తెలిపారు. కార్యకర్తలకు తాను అన్నివేళలా అండగా ఉంటానని చెప్పారు.

Tags:    

Similar News