కాంగ్రెస్ కు కొండా రాజీనామా

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. ఆయన త్వరలో బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. [more]

Update: 2021-03-16 00:50 GMT

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. ఆయన త్వరలో బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. కొండా విశ్వేశ్వర్ రెడ్డి 2014లో టీఆర్ఎస్ నుంచి ఎంపీగా గెలిచారు. తర్వాత కాంగ్రెస్ లో చేరారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. గతకొంత కాలంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి రాజీనామాతో కాంగ్రెస్ కు బిగ్ షాక్ అని చెప్పొచ్చు.

Tags:    

Similar News