కమీషన్ల కక్కుర్తితోనే

Update: 2018-10-10 08:48 GMT

మిర్యాలగూడలోని దామరచర్లలో యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ కట్టినిచ్చేది లేదని కాంగ్రెస్ ముఖ్యనేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. కమిషన్ ల కోసమే థర్మల్ విద్యుత్ ప్లాంట్ ను నిర్మించాలని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారని ఆయన ఆరోపించారు. థర్మల్ విద్యుత్ ప్లాంట్ ద్వారా పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతుందని, ఆ ప్రాంతం మొత్తం కాలుష్యంగా మారిపోతుందన్నారు. థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు మంచిది కాదని శాస్త్రవేత్తలే చెబుతున్నారని ఆయన గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టు వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు ఉంటుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ ప్లాంటును ఆపేందుకు కృషి చేస్తానన్నారు.

Similar News