కేసీఆర్ కుటుంబంపై సంచలన ఆరోపణలు

Update: 2018-07-06 09:53 GMT

కేసీఆర్ కుటుంబంపై నల్గొండ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కార్పొరేట్ విద్యాసంస్థ శ్రీ చైతన్యలో కేసీఆర్ కుటుంబానికి 40 శాతం వాటా ఉందని పేర్కొన్నారు. కేసీఆర్ సర్వేలు బూటకమని, కేసీఆర్ అంటున్నట్లుగా వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ వంద సీట్లు గెలవడం కాదు, ఆయన కూతురు కల్వకుంట్ల కవిత నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని టీఆర్ఎస్ కి సవాల్ విసిరారు. నకిరేకల్ లో నల్గొండ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ... నల్గొండ జిల్లా అంటేనే ముఖ్యమంత్రి కేసీఆర్ కి భయం పట్టుకుందని, కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రజల్లో తిరుగుతున్నారంటే కేసీఆర్ భయపడుతున్నారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో నకిరేకల్ లో కాంగ్రెస్ దే గెలుపని స్పష్టం చేశారు. రైతుల కోసం స్వంత డబ్బులతో పిల్లాయిపల్లి-ధర్మారెడ్డి గూడెం కాలువను పూర్తి చేశామని ఆయన గుర్తు చేశారు.

Similar News