కౌశిక్ రెడ్డికి భారీ జరిమానా

కాంగ్రెస్ వీడి టిఆర్ఎస్ పార్టీలో చేరిన పాడి కౌశిక్ రెడ్డి కి జిహెచ్ఎంసి అధికారులు షాక్ ఇచ్చారు . నగర వ్యాప్తంగా అనుమతులు లేకుండా ఫ్లెక్సీలు బ్యానర్లు [more]

Update: 2021-07-22 02:47 GMT

కాంగ్రెస్ వీడి టిఆర్ఎస్ పార్టీలో చేరిన పాడి కౌశిక్ రెడ్డి కి జిహెచ్ఎంసి అధికారులు షాక్ ఇచ్చారు . నగర వ్యాప్తంగా అనుమతులు లేకుండా ఫ్లెక్సీలు బ్యానర్లు కట్టినందుకు భారీ జరిమానా విధించారు. ప్రజల నుంచి ఫిర్యాదులు రావడంతో జి హెచ్ ఎం సి అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు . పాడి కౌశిక్ రెడ్డి కి రెండున్నర లక్షల రూపాయల ఫైన్ వేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కాంగ్రెస్ ను వీడిన తర్వాత పాడి కౌశిక్ రెడ్డి టిఆర్ఎస్ లో చేరారు . ఈ నేపథ్యంలో తాను టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్న నేపథ్యంలో నగర వ్యాప్తంగా పెద్ద ఎత్తున బ్యానర్లను ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే దీనిపై నగర ప్రజలు పెద్ద ఎత్తున ఫిర్యాదు చేశారు. బ్యానర్లు ఫ్లెక్సీలు కట్టవద్దని ప్రభుత్వం గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ కూడా పాడి కౌశిక్ రెడ్డి నగరవ్యాప్తంగా ఫ్లెక్సీలు బ్యానర్లు ఏర్పాటు చేయడంతో భారీ జరిమానా విధించినట్లు అధికారులు వెల్లడించారు.

Tags:    

Similar News