ఏడాది నుంచే మర్డర్ కు స్కెచ్

స్టీల్ వ్యాపారి రాంప్రసాద్ హత్య కేసులో పోలీస్ కస్టడీలో ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. హత్యకు ముందు పరిగి లో స్టీల్ ఫ్యాక్టరీ దగ్గర హత్య కు [more]

Update: 2019-07-22 07:09 GMT

స్టీల్ వ్యాపారి రాంప్రసాద్ హత్య కేసులో పోలీస్ కస్టడీలో ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. హత్యకు ముందు పరిగి లో స్టీల్ ఫ్యాక్టరీ దగ్గర హత్య కు పథకం పన్నారు. అక్కడికి రాంప్రసాద్ రాకపోవడంతో పంజాగుట్టలోని ఆఫీస్ దగ్గర పథకం వేసి హత్య చేశారుజ మూడు రోజులు ఆసక్తికరమైన విషయాలు కస్టడిలో పోలీసులకు నిందితుడు సత్యం కోగంటి చెప్పారు. వ్యాపారి రాం ప్రసాద్ హత్య కేసు లో నిందితులకు నేటి తో కస్టడీ ముగియనుం ది. కోగంటి సత్యం తో పాటు మిగతా నిందితులను ఈరోజు కూడా పంజాగుట్ట పోలీసులు విచారిస్తున్నారు. రామ్ ప్రసాద్ హత్య కు ఏడాది కాలంగా కోగంటి స్కెచ్ వేశారు. విజయవాడలోనే హత్య చేయాలని కోగంటి సత్యం అనుకున్నారు. ఎన్నికలు, ఫలితాలు , విజయవాడ సీపీ నుండి వరుస వార్ణింగ్ లు రావడం తో ప్లాన్ హైదరాబాద్ కు మార్పు చేసినట్టు వెల్లడించారు. ఏడాది కాలం నుంచి కూడా రామ్ ప్రసాద్ ని చంపేందుకు కోగంటి సత్యం ప్రయత్నం చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడయింది.

Tags:    

Similar News