దద్దమ్మలతో కమిటీలా?

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. విశాఖ గ్యాస్ లీక్ ఘటనను కూడా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారన్నారు. ఐఏఎస్ లతో కమిటీలు ఏంటని [more]

Update: 2020-05-09 14:36 GMT

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. విశాఖ గ్యాస్ లీక్ ఘటనను కూడా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారన్నారు. ఐఏఎస్ లతో కమిటీలు ఏంటని చంద్రబాబు ప్రశ్నించారని, కానీ నిజనిర్థారణ కమిటీ పేరుతో తాను అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, చినరాజప్పల వంటి దద్దమ్మలతో నియమిస్తారా? అని కొడాలి నాని ప్రశ్నించారు. చంద్రబాబు రాజకీయ జీవితంలో ఎప్పడైనా ఇంతటి భారీ పరిహారాన్ని ప్రకటించారా? అని ప్రశ్నించారు. 1998లో అదే కంపెనీలో ప్రమాదం జరిగితే చంద్రబాబు అప్పుడు కంపెనీని ఎందుకు మూయించలేదని ప్రశ్నించారు. నిపుణుల కమిటీ నివేదిక వచ్చిన తర్వాత కంపెనీ తరలింపుపైనా, యాజమాన్యంపై చర్యలపైనా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Tags:    

Similar News