దొంగ ఓట్లు వేస్తే 90 శాతం పోలింగ్ అయ్యేది

తిరుపతి ఉప ఎన్నికలలో దొంగఓట్లు పడలేదని ఏపీ మంత్రి కొడాలి నాని అన్నారు. అది చంద్రబాబు ఆడించిన డ్రామా అని చెప్పారు. దొంగ ఓట్లు పోలయి ఉంటే [more]

Update: 2021-04-20 00:54 GMT

తిరుపతి ఉప ఎన్నికలలో దొంగఓట్లు పడలేదని ఏపీ మంత్రి కొడాలి నాని అన్నారు. అది చంద్రబాబు ఆడించిన డ్రామా అని చెప్పారు. దొంగ ఓట్లు పోలయి ఉంటే 90 శాతం పోలింగ్ నమోదయ్యేదని కొడాలి నాని అన్నారు. కరోనా నియంత్రణకు లాక్ డౌన్ పరిష్కారం కాదని కొడాలి నాని అన్నారు. ప్రజలు తమంతట తామే నిబంధనలను పాటించాలన్నారు. లాక్ డౌన్ విధించినా ప్రయోజనం ఉండదని కొడాలి నాని అభిప్రాయపడ్డారు. తిరుపతిలో వైసపీ గెలుపు ఖాయమని, నాలగు లక్షల మెజారిటీ వస్తుందని చెప్పారు. చంద్రబాబు ఇక హైదరాబాద్ కే పరిమితమవ్వక తప్పదని కొడాలి నాని వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News