ఏపీలో నేడు కిషన్ రెడ్డి పర్యటన

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తిరుమలలో వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు, వేదపండితులు స్వాగతం పలికారు. కరోనా మహమ్మారి నుంచి దేశం బయటపడి ఆర్థిక పరిస్థితి నుంచి [more]

Update: 2021-08-19 02:56 GMT

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తిరుమలలో వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు, వేదపండితులు స్వాగతం పలికారు. కరోనా మహమ్మారి నుంచి దేశం బయటపడి ఆర్థిక పరిస్థితి నుంచి కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థించినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం లభిస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు. నేడు కిషన్ రెడ్డి విజయవాడలో ఏర్పాటు చేసే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం ఇంద్రకీలాద్రి పై ఉన్న దుర్గమ్మను దర్శించుకుంటారు.

Tags:    

Similar News