చిరంజీవి ఇంట్లో కీలక సమావేశం.. టాలీవుడ్ పెద్దలంతా?

మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో కీలక సమావేశం జరుగుతోంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా హాజరయిన ఈ సమావేశంలో అనేకమంది టాలీవుడ్ హీరోలు, నిర్మాతలు, దర్శకులు పాల్గొన్నారు. [more]

Update: 2020-05-21 05:59 GMT

మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో కీలక సమావేశం జరుగుతోంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా హాజరయిన ఈ సమావేశంలో అనేకమంది టాలీవుడ్ హీరోలు, నిర్మాతలు, దర్శకులు పాల్గొన్నారు. లాక్ డౌన్ కారణంగా గత రెండు నెలల నుంచి సినీ పరిశ్రమ మూతపడింది. దీంతో లక్షలాది మంది కార్మికులు వీధినపడ్డారు. సినిమా హాళ్లు కూడా ఇప్పట్లో తెరుచుకునే అవకాశం లేదు. దీంతో షూటింగ్ లు మొదలుపెట్టాలని సినీ పెద్దలు భావిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ప్రారంభించాలని అనుకుంటున్నారు. దీనిపై నేడు నిర్ణయం తీసుకునే అవకాశముంది. భౌతిక దూరం పాటిస్తూ, కోవిడ్ నిబంధనలను అమలుపరుస్తూ షూటింగ్ లు జరుపుతామని టాలీవుడ్ నేతలు హామీ ఇస్తున్నారు.

Tags:    

Similar News