టీడీపీ మేయర్ అభ్యర్థిగా కేశినేని శ్వేత

విజయవాడ మేయర్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ కేశినేని నాని కుమార్తె శ్వేతను ప్రకటించింది. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. విజయవాడలోని [more]

Update: 2021-03-05 01:00 GMT

విజయవాడ మేయర్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ కేశినేని నాని కుమార్తె శ్వేతను ప్రకటించింది. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. విజయవాడలోని 11వ డివిజన్ నుంచి పోటీచేస్తున్న కేశినేని శ్వేత తమ మేయర్ అభ్యర్థి అని అచ్చెన్నాయుడు తెలిపారు. తనను మేయర్ అభ్యర్థిగా ప్రకటించినందుకు పార్టీ అధినాయకత్వానికి కేశినేని శ్వేత కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడ అభివృద్ధికి తాను కృషి చేస్తానని కేశినేని శ్వేత తెలిపారు.

Tags:    

Similar News