జగన్ పూర్తిగా విఫలం.. కేంద్రంతో లాబీయింగ్

ముఖ్యమంత్రి పదవి జగన్ కు శాశ్వతం కాదని టీడీపీ ఎంపీ కేశినేని నాని అన్నారు. ముఖ్యమంత్రిగా జగన్ పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ప్రత్యేక హోదాపై మాట తప్పారన్నారు. [more]

Update: 2020-08-23 07:13 GMT

ముఖ్యమంత్రి పదవి జగన్ కు శాశ్వతం కాదని టీడీపీ ఎంపీ కేశినేని నాని అన్నారు. ముఖ్యమంత్రిగా జగన్ పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ప్రత్యేక హోదాపై మాట తప్పారన్నారు. 22 మంది ఎంపీలను వైసీపీకి ఇచ్చినా జగన్ ప్రత్యేక హోదాపై మాత్రం మాట్లాడటం లేదన్నారు. జగన్ తన కేసుల భయం వెంటాడుతుందని, అందుకే కేంద్రంతో లాబీయింగ్ చేస్తున్నారని కేశినేని నాని ఆరోపించారు. హిట్లర్ లాంటి వాళ్లే కాలగర్భంలో కలిసిపోయారన్నారు కేశినేని నాని. ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి జగన్ లబ్ది పొందాలని ప్రయత్నిస్తున్నారన్నారు.

Tags:    

Similar News