మంత్రి పది కోట్లు వసూలు చేశారు… కేశినేని సంచలన ఆరోపణ

విరాళాల పేరుతో వైసీపీ నేతలు బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని విజయవాడ ఎంపీ కేశినేని ఆరోపించారు. ఒక మంత్రి వ్యాపారుల నుంచి విజయవాడలో పది కోట్లు వసూలు చేశారని [more]

Update: 2020-05-03 06:40 GMT

విరాళాల పేరుతో వైసీపీ నేతలు బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని విజయవాడ ఎంపీ కేశినేని ఆరోపించారు. ఒక మంత్రి వ్యాపారుల నుంచి విజయవాడలో పది కోట్లు వసూలు చేశారని ఆరోపించారు. దుర్గగుడి సొమ్మును తమ ప్రచారానికి ఉపయోగించుకుంటున్నారన్నారు. తాను లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించలేదని, అయినా తనపై అక్రమంగా కేసులు నమోదు చేశారన్నారు. తనపై ఎన్ని కేసులైనా పెట్టుకోవచ్చన్నారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు సోషల్ డిస్టెన్స్ పాటించకుండానే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని, వారిపై కేసులు పెట్టారా? అని ప్రశ్నించారు. వ్యాపారుల నుంచి వసూలు చేసిన పదికోట్లను మంత్రి ఏం చేశారో చెప్పాలని కేశినేని డిమాండ్ చేశారు. విపత్తు సమయంలో విరాళాలు వసూలు చేసి వైసీపీ నేతలు దాచుకుంటున్నారన్నారు.

Tags:    

Similar News