కేశినేని నానిపై చంద్రబాబుకు టీడీపీ నేతల ఫిర్యాదు

బెజవాడ టీడీపీ పంచాయతీ చంద్రబాబు వద్దకు చేరింది. బెజవాడ టీడీపీ నేతలు ఎంపీ కేశినేని నానిపై ఫిర్యాదు చేశారు. పార్టీ మారిన వాళ్లను కేశినేని నాని ప్రోత్సహిస్తున్నారని [more]

Update: 2021-02-18 06:16 GMT

బెజవాడ టీడీపీ పంచాయతీ చంద్రబాబు వద్దకు చేరింది. బెజవాడ టీడీపీ నేతలు ఎంపీ కేశినేని నానిపై ఫిర్యాదు చేశారు. పార్టీ మారిన వాళ్లను కేశినేని నాని ప్రోత్సహిస్తున్నారని బుద్దా వెంకన్న వర్గీయులు ఆరోపిస్తున్నారు. పార్టీ కార్యాలయం విజయవాడలో ఉండగా, వ్యక్తిగతంగా పార్టీ కార్యాలయాన్ని ఎలా ప్రారంభిస్తారని కేశినేని నానిపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ ఎన్నికల కార్పరొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణలో బెజవాడ టీడీపీలో విభేదాలు తలెత్తడం ఆందోలన కల్గిస్తుంది. డివిజన్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి వచ్చిన కేశినేని నానిని టీడీపీ నేతలు నిలదీశారు.

Tags:    

Similar News