నిమ్మగడ్డకు పట్టిన గతేనంటూ…?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పొట్టూరి వరప్రసాద్ ఆస్తులను వేలం వేయనున్నారు. ఆయన కెనరా బ్యాంకు నుంచి రుణం తీసుకుని తిరిగి చెల్లించకపోవడంతో చెన్నైలో ఉన్న పీవీపీకి [more]

Update: 2019-08-02 04:28 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పొట్టూరి వరప్రసాద్ ఆస్తులను వేలం వేయనున్నారు. ఆయన కెనరా బ్యాంకు నుంచి రుణం తీసుకుని తిరిగి చెల్లించకపోవడంతో చెన్నైలో ఉన్న పీవీపీకి చెదని భూమిని వేలం వేయనున్నట్లు కెనరా బ్యాంకు అధికారులు తెలిపారు. పీవీపి కేపిటల్ లిమిటెడ్ కు చెందిన సంస్థ కెనరా బ్యాంకు నుంచి రుణం తీసుకుంది. ఈ రుణం ఇప్పటికి 149 కోట్లకు చేరుకుంది. ఎన్నిమార్లు నోటీసులు ఇచ్చినా స్పందన లేకపోవడంతో చెన్నైలోని పీవీపీ వెంచర్స్ కి చెందిన స్థలాన్ని వేలం వేయాలని బ్యాంకు అధికారులు నిర్ణయించారు. దీనిపై విజయవాడ ఎంపీ కేశినేని నాని ఘాటుగా ట్వీట్ చేశారు. “జగన్ గారూ మీ సహచరుడు బ్యాంకులకు డబ్బు ఎగ్గొట్టి తిరుగుతుంటే మీరేం చేస్తున్నారు? పీవీపికి నిమ్మగడ్డకు పట్టిన గతే పడుతుంది” అని కేశినేని నాని ట్వీట్ చేశారు.

Tags:    

Similar News