ఇద్దరు కాదంట… మొత్తం 51 మంది

అన్ని వయస్సుల మహిళలు శబరిమల ఆలయానికి వెళ్లవచ్చని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చాక ఇప్పటివరకు బిందు, కనకదుర్గ అనే ఇద్దరు మహిళలు వెళ్లారని అంతా భావించారు. వారిద్దరు [more]

Update: 2019-01-18 07:53 GMT

అన్ని వయస్సుల మహిళలు శబరిమల ఆలయానికి వెళ్లవచ్చని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చాక ఇప్పటివరకు బిందు, కనకదుర్గ అనే ఇద్దరు మహిళలు వెళ్లారని అంతా భావించారు. వారిద్దరు వెళ్లినందుకే పెద్దఎత్తున ఆందోళనలు జరిగాయి. అయితే, సుప్రీం తీర్పు అమల్లోకి వచ్చిన తర్వాత 10 నుంచి 50 ఏళ్ల వయస్సున్న మహిళలు ఇప్పటికి 51 మంది ఆలయ ప్రవేశం చేసినట్లు కేరళ ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు సుప్రీం కోర్టుకు నివేదిక సమర్పించింది.

Tags:    

Similar News