ఛీ..ఛీ.. చంద్రబాబుతో బతికుండంగ కలవం

Update: 2018-10-05 13:01 GMT

వనపర్తిలో జరిగిన టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం జరిగిన సభలో చంద్రబాబును ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడుతూ...‘‘నరేంద్ర మోదీ, నేను ఒక్కటైనమని చంద్రబాబు నాయుడు మాట్లాడుతడు.. నాకేం అవసరో నాకు అర్థం కాదు. చంద్రబాబును వేదిస్తున్నమంట.. ఏం వేదిస్తున్నం..? నువ్వు సక్కటి మనిషివి అని చెప్పి నిన్ను వేదిస్తున్నాము. ఓటుకు నోటు దొంగతనం చేసింది నిజం కాదా..? నువ్వు పంపితివి... ఓ బుడ్డరఖాన్ తెచ్చే.. దొరికిపాయే. అది నిజం కాదా..? ఆ దొంగతనంల నీ పాత్ర లేదా..? నీ వాయిస్ రికార్డు లేదా..? తెలుగువాళ్లం సొపతి ఉందామని చంద్రబాబు అడిగిండంట.. ఛీ..ఛీ చంద్రబాబుతో దోస్తీనా.. బతికుండంగ కూడా కలవం. నీ అడుగు పడితే పచ్చటి చెట్టు కూడా భస్మం అయితది. అంత దరిద్ర్యం, ఐరన్ లెగ్ నీది. ఇంకా మీ దోస్తీ మాకెందుకు. పొత్తు కలవకపోతే మహాకూటమి వచ్చిందని చంద్రబాబు అన్నడు. మీ దమ్మేందో.. మా దమ్మేందో ఎన్నికల్లో తేల్చుకుందాం.’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Similar News